Menu

బుల్లితెరపై దుమ్మురేపిన ‘దృశ్యం’

విక్టరీ వెంకటేశ్, మీనా ప్రధాన పాత్రలుగా నటించిన ‘దృశ్యం’ సిల్వర్ స్క్రీన్ పై ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. బుల్లితెరపై కూడా అదే ఘనవిజయాన్ని సొంతం చేసుకుని ఈవారం అత్యధిక  TRP రేటింగ్స్ తో దుమ్మురేపింది. ఈనెల 15 న సాయంత్రం 6 గంటల నుంచి జెమిని టీవి లో ప్రసారమైన ‘దృశ్యం’ 23.90 (TAM RATINGS ; GEC FEMAL 15+ MARKET) పాయింట్స్ ని సొంతం చేస్కోవడమే కాక WK8 లో టాప్ చైర్ లో కూర్చుంది. హీరో వెంకటేశ్ కు ఫ్యామిలీ ఆడియన్స్ లో వున్న ఫాలోయింగ్, వెంకటేశ్ – మీనా ల హిట్ కాంబినేషన్, వీటన్నిటికి తోడు ‘దృశ్యం’ సినిమా కథ, కథనంలో వున్న టెంపో బుల్లితెర ప్రేక్షకులను టీవి ముందు నుంచి కదలకుండా చేసాయి.  ఈ రేటింగ్స్ తో కొంతకాలంగా నెం 1 స్థానం కోసం కష్టపడుతున్న జెమినీ టీవి రేసులో ముందుకు రావడానికి దోహదపడిందని చెప్పవచ్చు.

Advertisement

 
Top